నాగరాజుపై కాల్పులు: నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో జ్యోతిష్యుడు నాగరాజుపై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జ్యోతిష్యుడు నాగరాజుపై జరిపిన కాల్పుల కేసులో పోలీసులు నలుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ డిసిపి వివరాలను మీడియాకు తెలిపారు.
నాగరాజు హత్య కోసం ఢిల్లీకి చెందిన చాంద్, సోహల్లకు సుపారీ ఇచ్చిన ప్రత్యర్థులు భూతం శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నందింగామ కాల్పుల ప్రతీకారంగానే సరూర్నగర్ కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.

సుపారీ తీసుకున్న బాబు, గణేష్లను కూడా అరెస్ట్ చేసినట్లు డిసిపి తెలిపారు. ఏలూరులో నాగరాజు అభివృద్ధిని ఓర్వలేకనే ప్రత్యర్థులు ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు. కాల్పుల ఘటనకు సంబంధమున్న మరో 8మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల సరూర్నగర్ జింకలబావి సమీపంలో జ్యోతిష్యుడిపై కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా నాగరాజుపై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పొట్టలోకి రెండు బుల్లెట్లు, తొడ భాగంలోకి ఒక బులెట్ దూసుకెళ్లింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న జ్యోతిష్యుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications