ఆ ప్రమాదం ఉంది: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ, శివరాజ్ కుమార్
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు నందమూరి బాలకృష్ణ.
బెంగళూరు: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు నందమూరి బాలకృష్ణ. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వైద్యానికి స్పందిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. తారకరత్న కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందన్న బాలకృష్ణ
తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలి. అతడి ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటే మెరుగ్గా ఉంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అని బాలకృష్ణ తెలిపారు. స్టంట్ వేయడం కుదరలేదు.. మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రత్యేక వైద్య బృందం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. మల్టిపుల్ మెడికేషన్ ఇస్తున్నారని చెప్పారు.
తారకరత్న చికిత్స స్పందిస్తున్నారంటూ బాలకృష్ణ
తారకరత్న ఎంతో ఓపిక కలిగిన వ్యక్తని.. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తని బాలకృష్ణ తెలిపారు. కర్ణాటకలో అభిమానులు ఎక్కువగా ఉన్నారన్నారు. తారకరత్న శరీరంలోని అవయవాలన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఈరోజు చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. మెడికేషన్ కొంత టైమ్ తీసుకుంటుందన్నారు. కళ్ల మూమెంట్ కూడా ఉందని చెప్పారు.
తారకరత్న కోలుకుంటారంటూ బాలకృష్ణ
తారకరత్న కోలుకుంటాడన్న నమ్మకం తమకుందన్నారు బాలకృష్ణ. బ్రెయిడ్ డ్యామేజ్ ఎంత వరకు ఉందన్నది తెలియాల్సి ఉందన్నారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థించండి. అభిమానుల ప్రార్థనలతో త్వరగా కోలుకుంటారన్న నమ్మకం ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారన్న శివరాజ్ కుమార్
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని ప్రముఖ కన్నడ సినీనటుడు శివరాజ్ కుమార్ తెలిపారు. చికిత్సకు స్పందించడం అనేది ముఖ్యమైన విషయమని అన్నారు. తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని శివరాజ్ కుమార్ తెలిపారు. బాలకృష్ణతో కలిసి శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
మరోవైపు, ఆదివారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు ఆస్పత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి రోజు పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. కుప్పంలో మొదట చికిత్స అందించి ఆ తర్వాత బెంగళూరు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.