Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగువారు గర్వపడేలా జగన్ నిర్ణయం: కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కుటుంబం..

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట‌రీ నియోజకర్గాన్ని జిల్లాగా మరుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఉగాది నాటికి ఈ ప్రక్రియను అంతా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. మరికొన్ని చోట్ల స్వాగతిస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్ ) పేరును ఖరారు చేసింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది.. పురందేశ్వరి

తాజాగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామకరణం చేయడంపై నందమూరి కుటుంబం స్వాగతించింది. ఎన్టీఆర్ కుమార్తె , మాజీ మంత్రి , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆయన బిడ్డగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!!! అంటూ పురందేశ్వరి ట్విట్ చేశారు.

 ప్రతి తెలుగువాడు గర్వపడేలా ప్ర‌భుత్వ‌ నిర్ణయం

ప్రతి తెలుగువాడు గర్వపడేలా ప్ర‌భుత్వ‌ నిర్ణయం

అటు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రాంతాలు వేరైనా తెలుగు బిడ్డలంతా ఒక్కటేనని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంతోషకరమైందన్నారు. ఏపీ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు రామకృష్ట చెప్పారు.

Recommended Video

    AP New Districts Complete Details 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు,నియోజకవర్గాలు | Oneindia Telugu
    తెలంగాణలోనూ ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు.. కేసీఆర్‌కు విజ్ఞప్తి

    తెలంగాణలోనూ ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు.. కేసీఆర్‌కు విజ్ఞప్తి

    మరోవైపు ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడాన్ని సినీ నిర్మాత,దర్శకుడు వైవీఎస్ చౌద‌రి స్పందించారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగుజాతిలో చైతన్యాన్ని నింపిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. తనకున్న బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో కాలుమోపిన అన్ని రంగాల్లో అఖండ విజయాలు సాధించారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్‌ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను వైవీఎస్ చౌదరి కోరారు. ఎన్టీఆర్‌ శత జయంతిని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఆకాంక్షించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+