నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఫిట్స్: అస్వస్థత, హైదరాబాద్కు తరలింపు
హైదరాబాద్: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి రక్తపోటు అధికం కావడంతో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోలుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో 30 ఏళ్ల తర్వాత బుధవారం జరిగిన జాతరలో కూడా పాల్గొన్నారు.

జాతర అనంతరం ఇంటికి చేరుకున్నారు. అయితే ఎండలో ఎక్కవసేపు ఉండటంతో రక్తపోటు అధికమై అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు న్యూరాలజిస్ట్ వరదరాజు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ హరినాథరెడ్డి వెళ్లి ఆయనకు చికిత్స చేశారు.
అయితే ఈ సమయంలో ఆయనకు ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో రాత్రి 7.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత హుటాహుటిన అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications