గాయపడి ఆస్పత్రిలో చేరిన నారా బ్రాహ్మణి: బాబు, బాలకృష్ణ పరామర్శ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలు, నందమూరి హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు.
చేతికి అయిన గాయానికి ఆమె అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారా బ్రాహ్మ్ణణిని చంద్రబాబు, బాలకృష్ణ మంగళవారంనాడు పరామర్సించారు. చంద్రబాబు దాదాపు గంటసేపు ఆస్పత్రిలోనే ఉండి కోడలి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్రాహ్మణి ప్రమాదానికి గురయ్యారనే వార్త వినగానే తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం ప్రారంభించాయి. గాయం చిన్నదేనని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
బ్రాహ్మణి ఆరోగ్యానికి ఏ విధమైన డోకా లేదని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.