బాబుకు కొత్తేంకాదు, పవన్కు రాంగ్ ఫీడ్: నారా లోకేష్, ‘తిరుమల జోలికొచ్చిన వారు ఎక్కడున్నారో’!
అమరావతి: దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం కొత్తేమీ కాదని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
తమ మీద విచారణ చేస్తోంటే సీబీఐ మీద నమ్మకం లేదన్న వాళ్లే... ఇప్పుడు సీబీఐ విచారణ గురించి మాట్లాడుతున్నారని లోకేష్ విమర్శించారు.
ఏ1, ఏ2లకు సమాధానం చెప్పాలా?
బీజేపీని ఓడించాలని కర్ణాటక ఎన్నికల్లో పిలుపిచ్చామని మంత్రి తెలిపారు. బజారున వెళ్లే వారి ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ1, ఏ2లకు నేను సమాధానం చెప్పాలా..? లోకేష్ ప్రశ్నించారు. ప్రధాని మోడీకి వైసీపీ ఎంపీలు కాపలా కాస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ, కుట్రలు చేస్తే..?: కేంద్రం, బీజేపీకి చంద్రబాబు హెచ్చరిక
పవన్కు రాంగ్ ఫీడ్బ్యాక్
ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్ కళ్యాణ్ గతంలో సీఎం దృష్టికి తీసుకురాగానే వెంటనే చర్యలు ప్రారంభించామని లోకేష్ చెప్పారు. కిడ్ని బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కిడ్ని బాధితులకు ఇంకా చేయాల్సి ఉందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్కి రాంగ్ ఫీడ్ బ్యాక్ వచ్చి ఉండొచ్చని, అందుకే అలా మాట్లాడుతున్నారని లోకేష్ అన్నారు.
పెద్దాయనంటూ పవన్కు నారా లోకేష్ సవాల్: ‘ట్రైలరే'నంటూ బీజేపీ, జగన్ పార్టీలను ఏకేశారు
ఇడుపులపాయ, లోటస్ పాండ్ నేలమాళిగల్లో..
‘గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ,లోటస్ పాండ్, యలహంకా కోటలో ఉన్న నేలమాళిగల్లో నుండి సిబిఐ తవ్వి తీస్తుంది' అని లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
తిరుమల జోలికొచ్చిన వారు ఎక్కడున్నారో...
‘ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2 లు పోరాటం చేస్తున్న టీడీపీ పై బీజేపీ తో కలిసి క్విడ్ ప్రో కో రాజకీయాలకు తెర లేపారు. గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు' అని లోకేష్ ఘాటుగా స్పందించారు.