నారా లోకేష్ సర్ ప్రైజ్ రివీల్.. రూ.82 వేల కోట్ల పెట్టుబడితో ఏపీకి బడా సంస్థ !
ఏపీని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు సారధ్యంలోని సర్కారు.. మరో భారీ విజయం దక్కించుకుంది. ఈ మేరకు ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని మంత్రి లోకేష్ ప్రకటించిన విషయంపై క్లారిటీ వచ్చింది. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!" అని ఆ బుధవారం ( నవంబర్ 12, 2025 ) పోస్టులో రాసుకొచ్చారు.
కాగా ఇప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది 'రీన్యూ' (ReNew) సంస్థ. ఈ సంస్థ రాష్ట్రంలో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి ఏపీకి రానుండటం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు.

ఈ మేరకు ఆ పోస్టులో.. ఐదేళ్ల విరామం తర్వాత 'రీన్యూ' సంస్థ ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉందని రాసుకొచ్చారు. రూ. 82,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్, అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. అలానే విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, ఆయన బృందానికి స్వాగతం పలికారు.
ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంటున్నారు.
#ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025
— Lokesh Nara (@naralokesh) November 13, 2025
After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be… pic.twitter.com/JczVgbtcEO
మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సును నిర్వహించనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ సమయంలోనే సదస్సు ప్రారంభానికి ముందే నేడు ( నవంబర్ 13, 2025 ) విశాఖలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు సహా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంఖుస్థాపన జరగనుంది.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications