జగన్ హయాంలో "కంటెయినర్ లో డ్రగ్స్" - తేల్చేసారు, వాట్ నెక్స్ట్..!!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటెయినర్ లో డ్రగ్స్ అంటూ రాజకీయంగా వివాదం చోటు చేసుకుంది. జగన్ హయాంలో రాష్ట్రానికి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయంటూ ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. వాటిని వైసీపీ తిప్పి కొట్టింది. కాగా, విశాఖ తీరానికి చేరిన ఆ కంటెయినర్ లో ఉన్న సరుకు పై సీబీఐ విచారణ చేసింది. తాజాగా నార్కోటిక్ లాబ్ అందులోని సరుకును పరీక్షించింది. మత్తు లేదని తేల్చింది. ఆ షిప్ ను విడుదల చేయాలని సీబీఐ లేఖ రాసింది. దీంతో, ఆ వివాదానికి ఇప్పుడు ముగింపు ఇచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ వివాదంగా మారిన 'విశాఖ కంటెయినర్ డ్రగ్స్' వ్యవహారంలో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్ డ్రగ్స్ ఉన్నాయంటూ రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలే డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. కాగా, వైసీపీ కౌంటర్ గా బీజేపీకి సంబంధించిన నేతల కంపెనీలకు ఆ కంటైనర్ లో సరుకు వస్తుందని చెప్పుకొచ్చింది. కాగా, ఈ కంటెయినర్ పైన సుదీర్ఘ కాలం విచారణ జరిగింది. ప్రాధమికంగా విచారణ చేసిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే వరకూ కంటెయినర్ను అక్కడే ఉంచారు.

ఇక, కంటెయినర్ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్ నమూనాలను సెంట్రల్ నార్కోటిక్ డ్రగ్స్ లేబొరేటరీకి పంపించారు. అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు(డ్రగ్స్) లేవని నివేదిక వచ్చిందని చెబుతున్నారు. అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించి, కేసును మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు.
దానికి న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఆ కంటెయినర్ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులకు 10 రోజుల క్రితం లేఖ రాశారు. నాడు కంటెయినర్ పైన వచ్చిన ఆరోపణలతో నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాలపై వచ్చి విచారణ ప్రారంభించారు. ఆ తరువాత నార్కోటిక్ లాబ్ లోనూ పరీక్షలు చేసారు. కాగా, అందులో ఎలాంటి డ్రగ్స్ లేవని నిర్దారించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications