Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!?

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు NDAకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మహిళా రిజర్వేషన్లు.. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 2029 ఎన్నికలకు ఎన్డీఏ సిద్దం అవుతోంది. ఈ సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా మారుతున్నాయి. అందునా.. బీజేపీకి మింగుడు పడని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పైన ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, పవన్ ను సైతం ఆ రెండు రాష్ట్రాల్లో కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!!
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!!

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై ఎన్డీఏ భారీ కసరత్తు చేస్తోంది. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న
బీజేపీ నాయకత్వం మిత్రపక్షాలను పూర్తిగా ఈ ఎన్నికల కోసం సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అదే టైం లో తమిళనాడులో మిత్రపక్షాలతో అధికార పగ్గాలు చేపట్టాలంటే డీఎంకేతో పాటుగా విజయ్ - టీవీకే పార్టీ పైన గురి పెట్టింది. దీంతో.. పశ్చిమ బెంగాల్ లో జాతీయ రాజకీయాల పైన పూర్తి అవగాహనతో పాటుగా.. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన ఏపీ సీఎం చంద్రబాబు సేవలను అక్కడ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.

didi-vs-chandrababu-pawan-vs-vijay-modi-style-power-moves-ahead-of-five-state-polls

ఈ మేరకు బీజేపీ నేతలు సీఎం చంద్రబాబుతో నేరుగా మాట్లాందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిస్థితులు.. తెలుగు ఓటర్లు.. రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. మమతకు చెక్ పెట్టే విధంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ.. ఇందులో చంద్రబాబు సేవలను వినియోగించుకునేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.

లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!

ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ లో 2021 లోనే విజయం కోసం బీజేపీ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసింది. అయినా, గెలుపు దక్కలేదు. దీంతో.. ఈ సారి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అదే విధంగా తమిళనాడు, కేరళలోనూ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో రాష్ట్రం తమిళనాడు ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. అక్కడ ఎన్డీఏ కోసం పవన్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ కు ఎంత మేర తగ్గించ కలిగితే అంత ఎన్డీఏకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

దీంతో, తమిళనాడు లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు అక్కడ ప్రచార బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ గట్టి పట్టుదల మీద ఉంది. ఈ క్రమంలో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆయన సినీ గ్లామర్ తో పాటు ఆయన ఫైర్ బ్రాండ్ స్పీచ్ ని వాడుకోవాలని చూస్తుందని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+