వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హృదయ విదారకం: శిశువును పీక్కుతిన్న కుక్కలు..
తల్లి కర్కష హృదయానికి ఆ శిశువు కుక్కల చేతిలో చిధ్రమైపోయింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం నాడు చోటు చేసుకుంది.
కురవి: కన్నపేగు మీద కనీస మమకారం లేని ఓ తల్లి.. అప్పుడే పుట్టిన ఒక శిశువును నడి వీధిలో వదిలేసి పోయింది. తల్లి కర్కష హృదయానికి ఆ శిశువు కుక్కల చేతిలో చిధ్రమైపోయింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం నాడు చోటు చేసుకుంది.
నవజాత శిశువును రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోవడంతో.. అక్కడి కుక్కలు పీక్కుతున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో కుక్కలు మరింత స్వైర వివాహరం చేశాయి. శిశువును నోట కరుచుకుని నిమిషాల్లో పీక్కుతిన్నాయి. కొద్దిసేపటికి అటుగా వచ్చిన స్థానికులు కుక్కలను తరిమిసేలోపు శిశువు ప్రాణాలు కోల్పోయింది. మరణించిన శిశువును మగబిడ్డగా గుర్తించారు.
Comments
English summary
A newborn baby left alone in a courtyard was eaten by stray dogs at Kuravi mandal in Mahabubabad district.
Story first published: Saturday, June 17, 2017, 16:25 [IST]