చినరాజప్ప ఇలా చేశారేంటి?: సీఎం సమక్షంలో రామానుజయకు అవమానం!
అమరావతి: హోంమంత్రి చినరాజప్ప వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలోనే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పట్ల అనుచితంగా వ్యవహరించడం కలకలం రేపింది.
సోమవారం సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ, కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామానుజయులు మాట్లాడుతుండగా.. హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా ఆయన వద్ద నుంచి మైక్ లాక్కున్నారు.

ఒక్కసారిగా చిన్నరాజప్ప వ్యవహరించడంతో రామానుజయతోపాటు అక్కడనున్నవారు ఆశ్చర్యపోయారు. అయితే అందరూ స్తబ్దుగానే ఉన్నారు. కాగా, ఈ సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చడం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడమే సీఎం చంద్రబాబు ప్రధాన ఆశయమని, చంద్రబాబు కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.
స్వలాభం కోసం కొందరు కాపులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కాపులకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేని చినరాజప్ప పేర్కొన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని, విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కావాలని సీఎంను కోరతామన్నారు. ఓ రాజకీయ పార్టీ చేతిలో ముద్రగడ కీలుబొమ్మ అని ఎద్దేవాచేశారు. ఈ ఏడాదిలోనే రిజర్వేషన్లు సాధిస్తామని చినరాజప్ప మరోసారి స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications