అవిశ్వాసం, కేంద్రంపై పోరాటం: టీడీపీకి అండగా ఉంటామన్న కనిమొళి
చెన్నై: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి డీఎంకే నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సోమవారం చెన్నైలో కనిమొళితో సమావేశమయ్యారు.
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చడంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆమెకు వివరించారు. పార్లమెంటులో తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలనే నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని, వారికి తాము అండగా ఉంటామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు నెరవేర్చాలని ఆమె ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. ఇటీవల కడపలో ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన ఆమరణ దీక్షకు కనిమొళి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications