బాబు ప్రభుత్వంపై అవిశ్వాసం, ఈ సెషన్లోనే చర్చ జరగాలి: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానం తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. ఈ నెల 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ తీర్మానం చేయనుంది.
నిబంధనల ప్రకారం తాము నోటీసు ఇచ్చిన రెండు రోజుల్లో స్పీకర్ దానిపై సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, తీర్మానం ప్రతిపాదించిన పది రోజుల్లోగా శాసనసభలో చర్చకు తీసుకోవాలని, ఈ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని, వచ్చే సమావేశాల్లో చర్చిస్తామంటే నిబంధనలు అంగీకరించవని ఆయనఅన్నారు. ప్రభుత్వాన్ని పడగొడుతానని తాను అన్న మాటలను వక్రీకరించారని ఆయన అన్నారు.

శాసనసభా సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16 పనిదినాలు ఉంటాయి. సమావేశాలను 40 రోజులు నిర్వహించాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని వైసిపి నేతలు కోరారు. అయితే, రాముడు మంచి బాలుడు అనే పద్ధతిలో వ్యవహరిస్తే చర్చలు అర్థవంతంగా సాగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
ఈ నెల 10వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. బడ్జెట్పై జరిగే చర్చకు యనమల ఈ నెల 17వ తేదీన సమాధానం ఇస్తారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications