'ఇతరులు లోనికి రాకూడదు'..అంటూ బోర్డు పెట్టిన గ్రామం:కారణం...విచిత్రమే;షరతులూ వింతే!
శ్రీకాకుళం:'ఇతరులు లోనికి రాకూడదు'...అనే ఈ బోర్డ్ సాధారణంగా ప్రభుత్వ రక్షిత కార్యాలయాల వద్దో...లేక ప్రైవేట్ కార్పోరేట్ ఆఫీసుల వద్దో కనిపిస్తుండటం కద్దు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం తమ ఊళ్లోకి అనుమతిని నిరాకరిస్తూ ఈ బోర్డు పెట్టడం ఒక విశేషమైతే...అందుకు వారు చెప్పిన కారణం ఇంకా విచిత్రంగా ఉంది. అంతేకాదు ఒకవేళ తమ ఊళ్లోకి ఎవరైనా రావాలనుకుంటే అందుకు పాటించాల్సిన షరతు కూడా వింత గానే ఉంది. ఇన్ని విశేషాలతో చర్చనీయాంశంగా మారిన ఆ ఊరు, ఆ బోర్డు, దాని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా?...అయితే చదివేయండి.
'ఇతరులు లోనికి రాకూడదు'...అనే ఈ బోర్డు పెట్టింది శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని చెక్కాపురం గ్రామస్థులు. ఆ మేరకు వాళ్లు తమ ఊరి ఎంట్రన్స్ లోనే ఈ హెచ్చరిక బోర్డ్ ను గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా పెట్టేసి దారి మూసేశారు. ఊళ్లోకి రాకుండా నిషేధాన్ని విధించడానికి ఈ గిరిజన గ్రామస్థులు చెబుతున్న కారణం తమ ఊళ్లో పండుగ చేసుకుంటున్నారట.

చెక్కాపురం గ్రామంలో ఈ నెల 19 నుంచి 24 వరకు 'గజం కంది పండగ' చేసుకుంటున్నామని...ఆ పండగకు ఎవరుబడితే వారు...ఎలా బడితే అలా రావడానికి వీలులేదని...అందుకే ఆ బోర్డు ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు.పండుగ జరిగే ఈ ఐదు5 రోజులూ తమ గ్రామంలోకి ఇతరులు రాకూడదని, ఒకవేళ ఏదేని కారణం చేత వస్తే పండుగ రోజులు అయ్యేంత వరకూ తిరిగి వెళ్లరాదని వారు చెబుతున్నారు.
అంతేకాదు ఆ మేరకు హెచ్చరికలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ హెచ్చరికలకు తగిన విధంగా పండుగ మొదలైన నాటినుంచి గ్రామస్థులు ఒక్కరు కూడా ఊరు దాటి బయటకు రావడం గాని...గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా గాని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదండీ...ఆ గ్రామం పెట్టిన హెచ్చరిక బోర్డు వెనుక కథాకమామీషు!
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications