మానవత్వాన్ని మంటగలిపారు: స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భర్తను ఈడ్చుకెళ్ళిన భార్య
గుంతకల్లు:మాయమౌతున్నాడమ్మా...మనిషన్నవాడు....మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ రాసిన పాట ఈనాటి పరిస్థితులకు అద్దంపడుతోంది. అనంతపురం జిల్లాలోని ఆసుపత్రిలో చోటుచేసుకొన్న ఘటనను చూస్తే ఈ పాట సరిగ్గా సరిపోతోంది. మానవత్వం లేకుండా ఆసుపత్రి సిబ్బంది వ్యవహారించిన తీరు విమర్శలకు తావిచ్చింది.
మారుతున్న పరిస్థితులతో మనిషిలో మానవత్వం, జాలి, కరుణ లాంటి పదాలకు పద్దతులకు దూరమౌతున్నాడు.లేవలేని పరిస్థితుల్లో ఉన్న రోగికి కనీసం స్ట్రెచర్ ఇచ్చేందుకు కూడ ఆసుపత్రి సిబ్బంది ముందుకు రాని దుస్థితి అనంతపురం జిల్లా గుంతకల్లు ఆసుపత్రిలో చోటుచేసుకొంది.

గుంతకల్లుకు చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరోచనాలతో ఆయన ఇబ్బందిపడుతున్నాడు. ఆయన సతీమణి శ్రీనివాసాచారిని ఆసుపత్రికి తీసుకువచ్చింది.
కాలికి గాయంతో పాటు నడవలేని పరిస్థితిలో ఉన్న శ్రీనివాసాచారిని ఆసుపత్రిలోపలికి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కోరింది. వారు ససేమిరా అన్నారు. పలుమార్లు ప్రాధేయపడింది. ఇక చేసేదిలేక భర్తను కింద పడుకోబెట్టి లాక్కెళ్ళి సర్జికల్ వార్డులో చేర్చింది.ఈ విషయం తెలుసుకొన్న ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. భాద్యులపై చర్యలు తీసుకొన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications