సమైక్యానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టండి: శోభానాగి రెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర పైన తమ పార్టీని ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి గురువారం అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగి రెడ్డి, ఇతర నేతలు విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం తాము అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశామని, అలాంటప్పుడు తమను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు.
విభజన విషయంలో ఎవరివి డ్రామాలో అసెంబ్లీని సమావేశపరుస్తే తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల వైఖరి విభజనపై ఏమిటో తెలియాల్సి ఉందన్నారు. అలాగే తమ స్టాండు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్ను ఎమ్మెల్యేలము కలుస్తామని చెప్పారు.

విభజన జరిపింది కాంగ్రెసు పార్టీ అని, లేఖ ఇచ్చింది టిడిపి అని ఆరోపించారు. తాము ఓ ప్రాంతంలో నష్టం జరుగుతున్నప్పటికీ సమైక్యవాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏ పార్టీ చేయనట్లుగా తాము ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేశామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిరణ్ ఈ రోజు సమైక్యవాదినంటూ కొత్తగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ పార్టీ చేయకున్న తమ పార్టీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు కూడా చేశారన్నారు.
మూడు డిమాండ్లు
విభజన నిర్ణయం నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశ పర్చాలి, సమైక్యాంధ్రపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, పాస్ చేయించిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపించి ఆ తర్వాత రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలనే మూడు డిమాండ్లు తాము చేస్తున్నామన్నారు. తాము సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్ను కలుస్తామని, అపాయింటుమెంట్ దొరికితే గవర్నర్ను కలుస్తామని చెప్పారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం సూచనల మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదింప చేసుకునేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు రావడంతో వారు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications