పవన్ అమ్ముడుపోయారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు: కాంగ్రెస్తో దోస్తీపై గోరంట్ల
విజయవాడ: ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయ పొత్తులు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంపై ఆయన స్పందించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు జైలు నుంచి బయటకు వచ్చారన్నారు.

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అఖిలపక్షాన్ని కూడగడుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వార్డు మెంబర్గా గెలవలేని జీవీఎల్ నర్సింహారావుకు టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం మొండి వైఖరితో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పత్తిపాటి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications