మీకివ్వం: రేవంత్-మోత్కుపల్లిలకు లోకేష్ షాక్, బీజేపీ పైనా..
విజయవాడ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బుధవారం నాడు షాకిచ్చారు. ఏపీ కోటా నుంచి తెలంగాణ ప్రాంత నాయకులకు రాజ్యసభ సీటు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఏపీలోనే తీవ్రమైన పోటీ ఉందని చెప్పారు.
రాజ్యసభ సీటు విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభకు బలమైన ఆశావహులు ఏపీ నుంచి ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఆరోగ్యబీమా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కాగా, తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రాజ్యసభకు తనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణ నేతలకు మాత్రం రాజ్యసభ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
అంతకుముందు కూడా ఓసారి రేవంత్ రెడ్డి అధినేత చంద్రబాబుకు రాజ్యసభ విషయమై ఓ సూచన చేశారు. ఓ స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచిద్దామని, ఏపీలో పోటీ తీవ్రంగా ఉన్నందున కుదిరే అవకాశం లేదని చంద్రబాబు అప్పుడే చెప్పేశారు. అయితే, బీజేపీకి ఇవ్వకుండే తెలంగాణ నేతలకు ఇస్తారని రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి వంటి వారు భావించారు. కానీ తెలంగాణ నేతలకు ఇచ్చేది లేదని లోకేష్ తేల్చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications