మీరు భయపడుతున్నారు: పవన్ కళ్యాణ్ విశాఖ సభకు నారా లోకేష్ కౌంటర్
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగుదేశం పార్టీ మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తోందని ఆ పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖపట్నం జనసేన కవాతులో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై శనివారం రాత్రి ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు కనీసం నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారి వారు ఇచ్చిన స్క్రిప్టును మాత్రమే ఎందుకు చదువుతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంను హుధుద్ వణికించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు సమయంలో నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చారన్నారు. తర్వాత విశాఖపట్నాన్ని దేశంలోనే మూడో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దారన్నారు.

దీనిని విశాఖపట్నం వాసులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, రెచ్చగొట్టే ధోరణి వల్ల రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు భయపడి విశాఖను వదిలి వెళ్లే పరిస్థితి రాకూడదన్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications