చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లు: మంత్రాలయంలో కలకలం..
గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లను గుర్తించారు.
మంత్రాలయం: కేంద్రం రద్దు చేసిన పెద్దనోట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ చెత్త కుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. పాత నోట్ల మార్పిడికి గడువు ముగిసిన 13రోజుల తర్వాత ఈ నోట్లు చెత్త కుప్పలో దర్శనమివ్వడం కర్నూలులో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసుల కథన ప్రకారం.. మంత్రాలయం పుణ్యక్షేత్రంలోని బస్టాండ్ కు వెళ్లే రహదారిలో ఆర్&బి గెస్ట్ హౌజ్ పక్కన్నే ఓ చెత్త కుప్ప ఉంది. గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు ఈ నోట్లను గుర్తించారు. రోడ్లపై ఊడ్చిన చెత్తను చెత్తకుప్పపై పడవేస్తుండగా.. రద్దయిన పెద్దనోట్లు వారి కంటపడ్డాయి.

విషయం ఆ నోటా.. ఈ నోటా.. పోలీసులకు తెలియడంతో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. రూ.12500 విలువ చేసే పాతనోట్లను పారవేసినట్టుగా గుర్తించారు. మంత్రాలయం వచ్చిన భక్తులెవరైనా ఈ చెల్లని నోట్లను ఇక్కడ పారేసుంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications