మళ్లీ పాత ట్రెండ్ లోకి.. ముఖ్యమంత్రి చంద్రబాబు!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ పాత ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ పరిపాలనపైనే దృష్టి కేంద్రీకరించిన ఆయన తిరిగి ఆకస్మిక తనఖీలు మొదలుపెట్టారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ పాత ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా గతంలో ఆయన ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి మాత్రం పారిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన చంద్రబాబు ఆకస్మిక తనిఖీలకు కాస్త దూరంగానే ఉన్నారు. ఏడాది క్రితం ఓసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టినా ఆ తరువాత దాన్ని కొనసాగించలేదు.

Old Trend Once Again.. CM Chandrabau started Sudden Visits!?

ఇప్పుడు తాజాగా మళ్లీ తన పాత ట్రెండ్ కు తెరతీశారు చంద్రబాబు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి విజయవాడలోని పలు ప్రాంతాలను ఆయన తనిఖీ చేశారు. గవర్నర్ పేటలోని ఆర్టీసీ-2 డిపో, కంట్రోల్ రూమ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాలువ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను కూడా ఆయన పరిశీలించారు.

ఆ తర్వాత బస్టాండులోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో విజయవాడ నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+