"వైఎస్ అప్పులన్ని జగన్ ఎదుగుదలకే తప్పా.., జనం నమ్మరు!"
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
విజయవాడ: వైఎస్ హయాంలో చేసిన అప్పులన్ని ఆయన తనయుడు జగన్ ఎదుగుదల కోసం చేసినవే తప్ప రాష్ట్రాభివృద్ధికి కాదని ఏపీ ప్రభుత్వ చీఫ్ పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు.
Recommended Video

మద్యపాన నిషేధం హామితో అధికారంలోకి వచ్చిన వైఎస్.. ఆ తర్వాతి కాలంలో దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారని అన్నారు. ఇక జగన్ పాదయాత్రపై పల్లె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అబద్దాల యాత్ర అని విమర్శించారు. అవినీతి ద్వారా అక్రమాస్తులను పోగేసుకున్న జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇది దేశంలోనే రికార్డు అని గుర్తుచేశారు. వైఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం వారికి భరోసా కల్పించిందని అన్నారు.












Click it and Unblock the Notifications