హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్కలను చంపాడని పంచాయతీ కార్యదర్శిపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వీధి కుక్కలను చంపాడనే ఆరోపణపై హైదరాబాదులోని మీర్‌పేట పోలీసులు స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విషం ఇచ్చి అతి కిరాకతంగా కుక్కలను చంపాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో కాంట్రాక్టు కార్మికులు సోమవారంనాడు విషం ఎక్కించి 25 వీధి శునకాలను చంపారని స్థానిక ఎంపిటిసి వి నరసింహ మీర్‌పేట పోలీసులకు మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు. కుక్కల విషయంలో ప్రభాకర్ రెడ్డి తగిన మార్గదర్శకాలను పాటించలేదని నర్సింహ ఆరోపించారు.

Panchayat secretary booked for killing dogs

ప్రభాకర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ పి. శంకర్ యాదవ్ చెప్పారు. ప్రభాకర్ రెడ్డిపై ఐపిసి సెక్షన్ 428, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇటీవలి కాలంలో హైదరాబాదులో వీధికుక్కలు ప్రజలపై విపరీతంగా దాడి చేస్తున్నాయి. వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై కూడా అవి దాడి చేసి దారుణంగా గాయపరిచిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.

English summary
Hyderabad Meerpet police registered a criminal case against Panchayat secretary Prabhakar Reddy for killing stray dogs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X