ఏమౌతుందో అర్థం కావట్లేదు: విభజనపై పరిపూర్ణానంద

Paripoornananda Swami
విజయవాడ: ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి ఆదివారం రాష్ట్ర తాజా పరిస్థితులపై అన్నారు. ఆయన విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తాజా పరిస్థితులపై ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి సమస్యను రాజకీయ పార్టీలే పరిష్కరించాలన్నారు. విభజన సమస్య ఓ చిక్కుముడిగా మారిందన్నారు. అది రాజకీయ సమస్య కాబట్టి వారే పరిష్కరించాలని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారికి కూడా ఏమీ అర్థం కాని విధంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితన్నారు. ఈ సమస్యకు వాళ్లు కారకులు.. వీళ్లు కారకులు అంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకోకుండా సమాలోచనలు జరిపి మంచి ఆలోచనలతో మంచి పతక రచన చేయాలని అభిప్రాయపడ్డారు. సమన్వయం తీసుకు రావాలని కోరారు.

బిజెపి సమావేశాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ సమావేశాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్షమందితో యాదవ గర్జన సభ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+