సునీత.. చలోబెజవాడ, కర్రతో బాలకృష్ణ, వందో సినిమాపై

హత్యారాజకీయాలతో అనేక ఇబ్బందులు పడ్డ కుటుంబం తనదన్నారు. ఈ రాజకీయాల వల్ల భర్తను సైతం తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హత్యారాజకీయాలతో భయానక వాతావరణం సృష్టించిన వారు, ఇప్పుడు హత్యారాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.
కర్ర సాయంతో అసెంబ్లీకి బాలకృష్ణ
ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడ్డ బాలకృష్ణ అసెంబ్లీకి చేతికర్ర సాయంతో వచ్చారు. కాలికి గాయం కావడంతో ఆయన చిత్కర్ర ఆసరాతో నడుస్తూ సభకు హాజరయ్యారు. ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.
తనకు తగిలిన గాయానికి 7 కుట్లు పడ్డాయని, ప్రతి సినిమాకు గాయం గుర్తుగా మిగిలిపోతోందన్నారు. తన వందో సినిమా పైన అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అభిమానులను తృప్తి పరచడంలోనే తనకు ఆనందం ఉందన్నారు. వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని, తర్వాత షూటింగ్లో పాల్గొంటానన్నారు.












Click it and Unblock the Notifications