వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పవన్ ఎఫెక్ట్: ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కేంద్రం కదిలింది..
కేంద్రం ఏర్పాటు చేయబోయే ఆ టీమ్ను త్వరలోనే ఏపీకి పంపిస్తామని నడ్డా చెప్పారు.
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ బాధితుల వ్యథలపై జనసేన అధ్యక్షుడు పవన్ స్పందించిన తీరు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక కార్యచరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే అంశంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల మూల కారణాలను పరిశోధించడానికి ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
కేంద్రం ఏర్పాటు చేయబోయే ఆ టీమ్ను త్వరలోనే ఏపీకి పంపిస్తామని నడ్డా చెప్పారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ టీమ్ ఉద్దానం రాబోతున్నట్టుగా తెలిపారు.కాగా, ఉద్దానంలో ప్రత్యేకంగా డయాలిసిన్ కేంద్రం ఏర్పాటు చేసి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
Comments
English summary
After the reaction of Pawan Kalyan on Uddhanam Kidney patients both central and state govts thinking to take actions
Story first published: Monday, January 9, 2017, 12:45 [IST]