వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన గడువు, లెక్కలోకి తీసుకొని ప్రభుత్వం!: రేపు పవన్ కళ్యాణ్ దీక్ష, అనుమతికి దరఖాస్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ శుక్రవారం ముగిసింది. సమస్యపై వెంటనే చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలని, 48 గంటల సమయం ఇస్తున్నానని జనసేనాని బుధవారం అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

JanaSena Party Chief Pawan Kalyan interaction with Uddanam Kidney Patients

శ్రీకాకుళం దాటేలోపు కీలక నిర్ణయం తీసుకుంటా, 48 గంటల సమయం ఇస్తున్నా: బాబుకు పవన్ అల్టిమేటంశ్రీకాకుళం దాటేలోపు కీలక నిర్ణయం తీసుకుంటా, 48 గంటల సమయం ఇస్తున్నా: బాబుకు పవన్ అల్టిమేటం

ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్ ఒక్కరోజు దీక్షకు సిద్ధమయ్యారు. అసలు పవన్ అల్టిమేటాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదని అంటున్నారు. దీంతో దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు జనసేన పోలీసులకు దరఖాస్తు చేసింది. శనివారం ఒక్కరోజు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు.

Pawan Kalyan one day deeksha for Uddanam kidney disease

ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని, వెంటనే ఆరోగ్య శాఖకు మంత్రిని నియమించాలని పవన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని దీక్ష నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్రను భద్రతా కారణాల వల్ల గురువారం, శుక్రవారం నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అదే సమయంలో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో దీక్షకు పూనుకుంటున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan to takeup one day deeksha for Uddanam kidney disease on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X