రాజకీయంగా విడిపోయినా భారతీయులుగా కలిసే ఉన్నాం : పవన్ కల్యాణ్

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాజకీయంగా వేరైనా, భారతీయులుగా కలిసే ఉంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సరిహద్దు రాష్ట్రాల మధ్య సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాలుగా ఏనుగుల దాడి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు ధ్వంసం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, ఈ నష్టాన్ని నివారించేందుకు కర్ణాటక సహకారం కోరామన్నారు. కర్ణాటక అందించిన కుంకీ ఏనుగులు భవిష్యత్తులో ప్రాణనష్టం, పంట నష్టాన్ని నివారిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ సంపద పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు సహకరించుకుంటాయని తెలిపారు.

Pawan Kalyan praises Karnataka government

రాజకీయంగా వేర్వేరు కూటములకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసం కర్ణాటక ముందుకు రావడం అభినందనీయమన్నారు. కర్ణాటక అందించిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటామని, వాటి సంరక్షణను తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కుంకీ ఏనుగుల కోసం పలమనేరు దగ్గర ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Pawan Kalyan praises Karnataka government
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు నాలుగు కుంకీ ఏనుగులను అప్పగిస్తున్నామని, వీటికి పూర్తి శిక్షణ ఇచ్చామని తెలిపారు. మానవ-ఏనుగుల సంఘర్షణ నివారణకు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒక ప్రాక్టికల్ నాయకుడు అని, సుపరిపాలనతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ బంధాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+