థ్యాంక్స్: శ్రీజకు డాక్టర్ పునర్జన్మ, పవన్ కళ్యాణ్ కూడా కాపాడారు!
హైదరాబాద్/ఖమ్మం: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సహాయం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీజ కోలుకోవడంలో పవన్ సహకారం మరువలేమని ఆమె తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. తాను కోలుకోవడానికి సహకరించిన పవన్కు శ్రీజ కృతజ్ఞతలు తెలిపారు. తనకు పవన్ అంటే ఇష్టమని ఆమె చెప్పారు.
హైదరాబాదుకు వెళ్లినప్పుడు శ్రీజ ప్రాణాల పైన ఆశ వదులుకున్నామని, మిత్రుల సలహా మేరకు ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించామని, డాక్టర్ అసాధారణ్ తమ బిడ్డకు పునర్జన్మనిచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించిన రెండో రోజు నుండే ఆమె ఆరోగ్యంలో మార్పు కనిపించిందని చెప్పారు. పవన్ కల్యాణ్ రావడంతో శ్రీజ త్వరగా కోలుకుందని, త్వరలో శ్రీజను ఆయన వద్దకు తీసుకు వెళ్లి కృతజ్ఞతలు చెబుతామన్నారు.

కాగా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. దీంతో ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీజను గురువారం డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబ సభ్యలు ఆమెను పాల్వంచ తీసుకెళ్లారు.
చిన్నారి శ్రీజ చివరి కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 17న ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆసుపత్రిలో స్వీట్లు పంచిపెట్టారు.
పాల్వంచకు చెందిన శ్రీజ డీఏవీ మోడల్ స్కూలులో ఏడో తరగతి చదవుతోంది. సెప్టెంబర్ 10న జ్వరంతో అనారోగ్యం పాలైంది. దీంతోపాటు మూర్చ రావడంతో హైదరాబాదు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. 15 రోజులు చికిత్స అందించారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్టోబర్ 2న ఖమ్మంలోని కార్తీక ఆశుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ అసాధరణ్ ఆమెకు వైద్యం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చిన్నారి కోరిక మేరకు పవన్ కలిశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications