జగన్ కారణంగా మారిన నిర్ణయం!: 16 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర
Recommended Video
ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 16వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.
వాడుకుంటున్నారు, అదే సవాల్: జగన్తో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాలు.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని భావిస్తున్నారు.
చదవండి: పవన్ కళ్యాణ్పై రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోపణలు, జేసీ దివాకర్ సెటైర్లు