రోడ్డెక్కుతా!: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అల్టిమేటం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మరోసారి గళమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు అండగా నిలబట్ట పవన్.. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం ఇది రెండోసారి. గతంలో రాజధాని భూములపై స్పందించారు. మరోసారి భూసేకరణపై స్పందించారు.
ప్రభుత్వం భూసేకరణ చట్టంతో భూములు సేకరిస్తే తాను వ్యతిరేకిస్తానని, అవసరమైతే రైతులకు అండగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రైతుల తరఫున పోరాడుతానని చెప్పారు.

- పవన్, రైతులకు అండగా నిలుస్తాం, భూసేకఱణ చట్టంతో భూమలు సేకరిస్తే వ్యతిరేకిస్తాం, వ్యతిరేకంగా ఆందోళన, పవన్ అల్టిమేటం,
'ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం (అంధ్రప్రదేశ్) ప్రభుత్వం, రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.' అని మొదటి ట్వీట్ చేశారు.
ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.
— Pawan Kalyan (@PawanKalyan) April 10, 2015 'ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నాను.' అని రెండో ట్వీట్ చేశారు.
ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) April 10, 2015 'ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను.' మూడో ట్వీట్ చేశారు.
ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) April 10, 2015 











Click it and Unblock the Notifications