వైసీపీకి మద్దతుగా జబరస్థ్ నటుడు..ఇండస్ట్రీలో లేకుండా చేస్తామంటూ జనసేన బెదిరింపు
ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలందరూ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా మెగా హీరోలతో పాటు, జబర్థస్త్ బ్యాచ్, సీరియల్స్ బ్యాచ్ మొత్తం కూడా రంగంలోకి జనసేన తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. యాంకర్ శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతు నిలుస్తున్నారు.
వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆమెపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఘెరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తుందనే కారణంతో ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఈ లిస్ట్లో తాజాగా మరో నటుడు చేరాడు. వైసీపీకి సపోర్టు చేయడంతో అతనికి అవకాశాలు లేకుండా చేస్తామని బెదరించడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ మంత్రి రోజాకు మద్దతుగా ఓ వీడియోను షేర్ చేశారు.

అయితే రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ కు భయపడిన రాకేష్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయడం జరిగింది. పవన్ ఫ్యాన్స్ తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి మద్దతుగా నిలిస్తే వారిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే పవన్కు పడే ఓట్లు కూడా తగ్గిపోతాయని వారు అభిమానులను హెచ్చరిస్తున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications