ఎర్రచందనం స్మగ్లింగ్: సోము రవిపై పిడి యాక్ట్ నమోదు
కడప: ఎర్రచందనం స్మగ్లర్ సోము రవిపై పీడీయాక్ట్ నమోదు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శేషాలచం అడవుల్లో ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్పై దాడులు మరింత పెంచారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టండంపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో సోము రవి అనే వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీయాక్ట్ నమోదు చేశారు. సోముపై 23 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలోని అన్నాసాలైకు చెందిన స్మగ్లర్ సోము రవి ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రేణిగుంట సమీపంలో పోలీసులు సోమును అదుపులోకి తీసుకుని తిరుపతి జైలుకు తరలించారు.

అతనిపై ఉన్న కేసులను పరిశీలించిన అనంతరం పీడీయాక్ట్ నమోదు చేసి కడప జైలుకు తరలించారు. సోము రవిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు పోలీసులపై దాడులు చేసిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కడప సెంట్రల్ జైలులో కిడ్నాపర్ల గ్యాంగ్ లీడర్ సునీల్ ఆగడాలు పెరుగుతున్నాయని అంటున్నారు. పెన్నా బ్యారెక్లో రెండు సెల్ఫోన్లు, ఛార్జర్లను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications