వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో టీవీ చానెళ్ల బ్యాన్‌పై హైకోర్టులో పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిషేధానికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అలాగే ఈ రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

తెలంగాణ 10 జిల్లాల్లో ఏబీఎన్, టీవీ-9 ఛానళ్ల ప్రసారాలు నిలిపిపేయడంపై వెంకట నారాయణ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాచార చట్టం హక్కును హరిస్తూ ఎంఎస్‌వోలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఆచేతనంగ ఉండిపోయిందని వెంకట నారాయణ ఆ పిటిషన్‌లో అన్నారు.

 Petition filed challenging ban on TV channels

దీనికి సంబంధించి తాము నెలకు రూ. 180లు చెల్లిస్తున్నామని, తమకు అవసరమైనటువంటి ఛానల్స్ చూసే అవాకాశం ఉన్నప్పటికీ ఎంఎస్‌వోల నిర్ణయంతో తాము ఆ రెండు ఛానల్స్‌ను చూడలేక పోతున్నామని ఆయన పిటిషనల్‌లో చెప్పారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో వెంకటనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో ప్రసారాలు చేశారనే ఆరోపణపై ఆ రెండు చానెళ్ల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు చానెళ్ల ప్రసారాలను ఎంఎస్‌వోలు నిలిపేశారు.

English summary
One Venkata narayana filed petition challenging ban on TV9 and ABN Andhrajyothy in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X