ఏపీ హైకోర్టులో ఇంట్రెస్టింగ్ పిటిషన్ : ఫూలే జయంతి ఉంది... ఎన్నికలు వాయిదా వేయండి !
అమరావతి : దేశవ్యాప్తంగా ఓట్ల పండగ కోసం పార్టీలు, నేతలు బిజీ బిజీగా ఉంటే .. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంట్రెస్టింగ్ పిటిషన్ దాఖలైంది. ఏపీలో లోక్సభ, పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలని సామాజిక సేవా సంస్థ ప్రజా ప్రయోజన వ్యాఖ్యం వేసింది. ప్రతి ఏటా ఏప్రిల్ 11న సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి నిర్వహిస్తామని, అదేరోజు ఎన్నికలు నిర్వహించడంతో జయంతి వేడుకలకు ఆటంకం కలుగుతోందని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్పందించని ఈసీ ..
ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించడంతో తమకు ఇబ్బంది కలుగుతుందని గుంటూరు జిల్లాకు చెందిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే కోర్టును ఆశ్రయించానని పేర్కొన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించానని తెలిపారాయాన.

హైకోర్టుకు చేరిన పిల్
ఈసీ జారీచేసిన ప్రకటనను రద్దు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు పిటిషనర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక వాయిదా వేసేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. తన పిల్లో ఎన్నికల కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చాడు.












Click it and Unblock the Notifications