వారు చెప్పినవే చేస్తున్నాం: నాయిని, చేతకాకుంటే రిజైన్: కేసీఆర్పై లోకేష్
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ప్రభావం లేదని, తమ ప్రభుత్వం వారు చెప్పినవే పాటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాల్లో తాము చాలా వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు.
భూమి లేని రైతులకు భూమి ఇస్తున్నామని, వికలాంగులకు రూ.1500 పించన్ ఇస్తున్నామని, ముఖ్యంగా తెలంగాణకు నీటి వనరులు సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము అత్యధిక శాతం వారి చెప్పినవే అమలు చేస్తున్నామన్నారు. నాయిని పాసింగ్ ఔడ్ పరేడ్లో పాల్గొన్నారు.
మరోవైపు, టీడీపీ యువనేత నారా లోకేష్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు పైన ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. ఆరు నెలల తెరాస పాలనలో సాధించింది శూన్యమన్నారు. ఈ ఆర్నెల్ల పాలనలో ఏం చేయలేని వారు చంద్రబాబు పైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. తెరాసకు అభివృద్ధి చేయడం చేతకాకుంటే, రాజీనామా చేయాలని, టీడీపీ అభివృద్ధి చేస్తుందన్నారు.
నాయిని
తెలంగాణలో మావోయిస్టు ప్రభావం లేదని, తమ ప్రభుత్వం వారు చెప్పినవే పాటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని మాట్లాడారు.
నాయిని
మావోయిస్టు సిద్ధాంతాల్లో తాము చాలా వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. భూమి లేని రైతులకు భూమి ఇస్తున్నామన్నారు.
నాయిని
వికలాంగులకు రూ.1500 పించన్ ఇస్తున్నామని, ముఖ్యంగా తెలంగాణకు నీటి వనరులు సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
నాయిని
తాము అత్యధిక శాతం వారి చెప్పినవే అమలు చేస్తున్నామన్నారు. కాగా, నాయిని నర్సింహా రెడ్డి పాసింగ్ ఔడ్ పరేడ్లో పాల్గొన్నారు.
నారా లోకేష్
ఈ ఆర్నెల్ల పాలనలో ఏం చేయలేని తెరాస ప్రభుత్వం చంద్రబాబు పైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. తెరాసకు అభివృద్ధి చేయడం చేతకాకుంటే, రాజీనామా చేయాలని, టీడీపీ అభివృద్ధి చేస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.