ఇద్దరు గర్ల్స్కి బాబు నజరానా, బాధితులతో.. (పిక్చర్స్)
హైదరాబాద్: కామన్వెల్త్ పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు మత్స సంతోషి, నాగలక్ష్మిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నజరానాలు అందచేసింది.
కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచిన విజయనగరం అమ్మాయి సంతోషికి.. రూ.7.5 లక్షలు, ప్రపంచ కబడ్డీ పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలైన ప్రకాశం జిల్లా క్రీడాకారిణి నాగలక్ష్మికి రూ.25 లక్షల చొప్పున చంద్రబాబు చెక్కులు అందజేశారు.
భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని, అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చంద్రబాబు అన్నారు.
నజరానా
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మహిళల వెయట్లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం మత్స సంతోషికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక బహుమతిగా 7.5 లక్షల రూపాయల చెక్కును అందించారు.
నజరానా
ప్రపంచ కబడ్డీ పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలైన ప్రకాశం జిల్లా క్రీడాకారిణి నాగలక్ష్మికి రూ.25 లక్షల చొప్పున చంద్రబాబు చెక్కులు అందజేశారు.
నజరానా
ముఖ్యమంత్రి కార్యాలయంలో సంతోషి, నాగలక్ష్మి తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో సంతోషి మరిన్ని పతకాలను ఆర్జిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నజరానా
కాగా, సంతోషికి కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం లభించింది. అయతే, స్వర్ణం సాధించిన చికా అమలహా డోపింగ్ పరీక్షలో పట్టుబడడంతో, రజత పతకం గెలిచిన డికా తువాకు స్వర్ణం లభించింది. ఆమె స్థానంలో సంతోషి రజత పతకాన్ని అందుకుంది.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు లేక్ వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రాలు అందజేశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు లేక్ వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రాలు అందజేశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు లేక్ వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఓ వికలాంగుడితో, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న చంద్రబాబు.