టీ సర్వేపై అవేర్నెస్ ఇలా.., టాప్ ఎక్కేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: వృత్తి, ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సొంత ఊరికి పయనమయ్యారు. రెండురోజులుగా.. బస్సులు, రైళ్లు, ఇతర ప్రయివేటు వాహనాల్లో కాలు పెట్టేందుకు వీలులేని పరిస్థితి కనిపిస్తోంది.
మంగళవారం నాడు (19వ తేదీ) జరిగే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనే నిమిత్తం సకుటుంబ సమేతంగా వారు స్వస్థలాలకు బయల్దేరారు.
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బయలుదేరే కుటుంబాలతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పలు జిల్లాల ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఎన్యుమరేటర్లు సర్వే పైన అవగాహన కల్పిస్తున్నారు.
సర్వే అవేర్నెస్
ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే నేపథ్యంలో... బాగ్ లింగంపల్లిలో ఓ ఇంటికి సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్ను అతికిస్తున్న ఎన్యుమరేటర్ దృశ్యం.
సర్వే అవేర్నెస్
ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే నేపథ్యంలో... ఓ కుటుంబ సభ్యులకు సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ఇచ్చి, దాని గురించి వివరిస్తున్న దృశ్యం.
సర్వే అవేర్నెస్
ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే నేపథ్యంలో... బాగ్ లింగంపల్లిలో ఓ ఇంటికి సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్ను అతికిస్తున్న ఎన్యుమరేటర్ దృశ్యం.
సర్వే అవేర్నెస్
ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే నేపథ్యంలో... బాగ్ లింగంపల్లిలో ఓ ఇంటికి సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్ను అతికిస్తున్న ఎన్యుమరేటర్ దృశ్యం.
సమగ్ర కుటుంబ సర్వే
ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం చెప్పడంతో ఈ నెల 19వ తేదీన సర్వే కోసం హైదరాబాద్ నగరంలోని ప్రజలు, పట్టణాల్లోని ప్రజలు గ్రామాల బాట పట్టారు. బస్సు ఎక్కేందుకు ప్రయాణీకుల ఇక్కట్లు.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్లోని ప్రజలు తమ తమ గ్రామాలకు తరలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19న ‘సమగ్ర కుటుంబ సర్వే'ను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు చేపడుతోంది.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్లోని ప్రజలు తమ తమ గ్రామాలకు తరలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19న ‘సమగ్ర కుటుంబ సర్వే'ను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు చేపడుతోంది.
సమగ్ర కుటుంబ సర్వే
సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. సర్వేకు ప్రతి కుటుంబం హాజరు కావాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బయలుదేరే కుటుంబాలతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయిన దృశ్యం.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బయలుదేరే కుటుంబాలతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయిన దృశ్యం. టిక్కెట్ కౌంటర్ వద్ద క్యూ.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బయలుదేరే కుటుంబాలతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయిన దృశ్యం. టిక్కెట్ కౌంటర్ వద్ద క్యూ.
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్లోని ప్రజలు తమ తమ గ్రామాలకు తరలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19న ‘సమగ్ర కుటుంబ సర్వే'ను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు చేపడుతోంది.
సమగ్ర కుటుంబ సర్వే
పట్టణాల్లో నివసిస్తున్నవారు, ఇతర రాష్ట్రాలకు వలసపోయినవారు గ్రామాలకు తిరిగొస్తున్నారు. సర్వే రోజున నివాసం ఉన్నచోటనే తమ వివరాలు అందించవచ్చని ప్రభుత్వం చెప్పింది.
సమగ్ర కుటుంబ సర్వే
తాత్కాలిక ఉపాధి కోసం పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు మాత్రం తమ చిరునామాను పల్లెల్లోనే నమోదు చేసుకోవాలని భావిస్తున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే
ఉపాధి కోసం పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన చాలామంది సొంత ఊరి చిరునామాతోనే కొనసాగుతున్నారు. కొందరైతే అటు పల్లెల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ చిరునామా కలిగి ఉన్నారు. కాగా, గ్రామాల్లోకి వెళ్లేందుకు బస్సు టాప్ ఎక్కి కూర్చున్న దృశ్యం.
సమగ్ర కుటుంబ సర్వే
పట్టణాల్లోని అద్దె నివాసాల్లో చిరునామా నమోదు చేయించడానికి చాలామంది సుముఖంగా లేరు. అందుకే సొంత ఊరిలోనే వివరాలు అందించాలని భావిస్తున్నారు.