బాబుకు తానా రూ.2 కోట్లు, ఇందిర రూ.10 లక్షలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 2 కోట్ల రూపాయల విరాళం అందజేసింది.
తానా అధ్యక్షుడు న్ననపనేని మోహన్, కోమటి జయరాం, వేమల సతీష్, తాతా మధుసూదన్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తానా ప్రతినిధులు గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
గురువారం వారు సచివాలయంలో చంద్రబాబును కలిశారు. ఆయనకు చెక్కు ఇచ్చారు. తానా సభ్యులు ఎంత విరాళం ఇచ్చారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు.
ఇందిరా దత్
వరల్డ్ తెలుగు ఫెడరెషన్ అద్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షల చెక్ ఇస్తున్న దృశ్యం.
ఇందిరా దత్
వరల్డ్ తెలుగు ఫెడరెషన్ అద్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షల చెక్ ఇస్తున్న దృశ్యం. హిధుద్ తుఫాను బాధితుల నిమిత్తం ఇచ్చారు.
సత్యనారాయణ
ప్రొలిఫిక్స్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ సత్యనారాయణ గురువారం నాడు చంద్రబాబును కలిసి రూ.25 లక్షల చెక్కు ఇస్తున్న దృశ్యం. హుధుద్ తుఫాను బాధితుల నిమిత్తం ఇచ్చారు.
తానా
చంద్రబాబును కలిసిన తానా ప్రతినిధులు రూ. రెండు కోట్ల చెక్కు ఇస్తున్న దృశ్యం. ఉత్తరాంధ్రలో స్కిల్ సెంటర్ను డెవలప్మెంటు కోసం తాము కంకణం కట్టుకున్నామని తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ ఈ సందర్భంగా తెలిపారు.
తానా
గ్రామీణ ప్రాంతలో యువతీయువకులకు స్కిల్స్ డెవలప్మెంట్ చేయటం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు చక్కటి సందేశం ఇచ్చారన్నారు. అందులో భాగంగా రూ.2 కోట్లు ఇవ్వడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్కు వందకోట్లకు పైగా సహాయం అందించాలని నిర్ణయించామని మోహన్ చెప్పారు.