జౌళీపై కావూరి ఆఫర్!: చిరు హావభావాలు (పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు బేగంపేటలోని పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను బుధవారం ప్రారంభించారు. అనంతరం షోరూంలోని స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ షోరూంలో మెటల్తో తయారు చేసిన వివిధ ఆకృతుల వస్తువులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కావూరి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు రూ.100 కోట్లతో జౌళీ పార్కు ఏర్పాటుకు ముందుకు వస్తే అందులో రూ.40 కోట్ల మేర రాయితీలు ఇస్తామని చెప్పారు. పెట్టుబడిలో రూ.40 కోట్లను బ్యాంకులు సమకూర్చే వీలుందని, మరో రూ.20 కోట్లు మాత్రమే పారిశ్రామికవేత్తలు సమకూర్చుకుంటే పార్కు ఏర్పాటు సాధ్యమన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున జౌళీ పార్కుల ఏర్పాటుకు తాము ఆహ్వానిస్తున్నామన్నరు. రాష్ట్రంలోని పలువురు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారన్నారు. హస్తకళలను, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు విదేశాల్లోను విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టెక్స్టైల్ పార్కుల కోసం ప్రభుత్వం ఎపిలో నాలుగువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

బొమ్మలు
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు బుధవారం బేగంపేటలోని పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించారు.

ఆకట్టుకుంటున్న బొమ్మలు
హైదరాబాదులోని బేగంపేటలో పర్యాటక భవన్లోని కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంలో ఏర్పాటు చేసిన పలు బొమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి.

మెటల్ బొమ్మలు
హైదరాబాదులోని బేగంపేటలో పర్యాటక భవన్లోని కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంలో ఏర్పాటు చేసిన మెటల్ వస్తువులు, బొమ్మలు ఆకట్టుకున్నాయి.

జౌళీ పార్కు
పారిశ్రామికవేత్తలు రూ.100 కోట్లతో జౌళీ పార్కు ఏర్పాటుకు ముందుకొస్తే ప్రభుత్వం రూ.40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కావూరి తెలిపారు.

మెటల్ వస్తువులు
హైదరాబాదులోని బేగంపేటలో పర్యాటక భవన్లోని కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంలో ఏర్పాటు చేసిన మెటల్ వస్తువులు, బొమ్మలు ఆకట్టుకున్నాయి.

నిర్వాహకులతో
బేగంపేటలోని పర్యాటక భవన్లోకాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతున్న కావూరి సాంబశివ రావు.

కావూరి
బేగంపేటలోని పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు షోరూంలోని స్టాళ్లను పరిశీలించారు.

షోరూం ప్రారంభం
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు బుధవారం బేగంపేటలోని పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించారు.

పరిశీలన
పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు షోరూంలోని స్టాళ్లను పరిశీలించారు.

అద్భుతం!
బేగంపేటలోని పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూంను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు షోరూంలోని స్టాళ్లను పరిశీలించారు.

మాట్లాడుతున్న కావూరి
పర్యాటక భవన్లో కాటేజ్ ఇండస్ట్రీస్ షోరూం ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు.

ఇండియన్ గార్మెంట్స్
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు తాజ్ కృష్ణలో బుధవారం ఇండియన్ రిపబ్లిక్ గార్మెంట్స్ను ప్రారంభించారు.

కావూరి, చిరు
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు తాజ్ కృష్ణలో బుధవారం ఇండియన్ రిపబ్లిక్ గార్మెంట్స్ను ప్రారంభించిన అనంతరం సమావేశంలో....

కావూరి
తాజ్ కృష్ణలో బుధవారం ఇండియన్ రిపబ్లిక్ గార్మెంట్స్ను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావుల హావభావాలు.












Click it and Unblock the Notifications