తిని చూసిన గంటా: కోపం వచ్చింది, ఆరా తీసి (పిక్చర్స్)
విశాఖ: ఆనందపురం మండలం గిడిజాల జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పైడిరాజు పైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల పని తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి సోమవారం ఉదయం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత విద్యార్థుల హాజరు పట్టీని, మధ్యాహ్న భోజన పథకం బియ్యం రిజిస్టర్ను పరిశీలించారు.
అందులోని లోపాలను గుర్తించి మండిపడ్డారు. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కొరత పైన ప్రధానోపాద్యాయుడిని మందలించారు.
తనిఖీ
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న దృశ్యం.
రిజిస్టర్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిజిస్టర్ తనిఖీ చేస్త..
వంటకం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంటను తనిఖీ చేస్తూ..
తిని చూసి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట తిని చూస్తూ...
విద్యార్థులతో..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నుండి వివరాలు ఆరా తీస్తూ...