వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ టార్గెట్ మిస్!: భేటీలో షర్మిల అసంతృప్తి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో విఫలమయ్యామని, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారట. శనివారం పార్టీ విస్తృతస్థాయి భేటీ జరిగింది.

ఈ భేటీలో షర్మిల పాల్గొన్నారు. సమైక్య ఉద్యమంలో జగన్ నిర్దేషించిన లక్ష్యాలను చేరుకోలేకపోయామని, ఎపిఎన్జీవోలు తమ పార్టీని నమ్మడం లేదని ఆమె నేతల ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో సమైక్య ఉద్యమంలో పార్టీ మరింత కీలక పాత్ర పోషించే విధంగా ఆ పార్టీ ఉద్యమ కార్యాచరణను రూపొందించింది.

కాగా, విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి వేదిక పైన కనిపించలేదు. ఆయన కింద కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నిర్వహించగా, విజయమ్మ, షర్మిల, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బాజిరెడ్డిగోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజయమ్మ నివాళి

విజయమ్మ నివాళి

పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

షర్మిల నివాళి

షర్మిల నివాళి

హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

షర్మిల, విజయమ్మ

షర్మిల, విజయమ్మ

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ విజయమ్మతో పాటు షర్మిల పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విజయమ్మ

మాట్లాడుతున్న విజయమ్మ

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

హాజరైన వారు

హాజరైన వారు

హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకురాలు షర్మిల.

షర్మిల అసంతృప్తి

షర్మిల అసంతృప్తి

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకురాలు షర్మిల. జగన్ నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారట.

వినతి పత్రం

వినతి పత్రం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం అందిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు.

English summary

 YSR Congress Party leader Sharmila said that Congress is giving Seperate Andhra as Telangana people were asked for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X