రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు, ఫుటేజీల ఆధారంగా(పిక్చర్స్)
విశాఖపట్నం: బ్యాంకులో నుండి ఐదు లక్షల రూపాయలను డ్రా చేసుకొని తీసుకు వెళ్తుండగా చోరీ చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
పెందుర్తికి చెందిన బిల్డర్ సుబ్రహ్మణ్యం గురువారం రెడ్నం గార్డెన్స్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచికి వచ్చారు. చెక్కు నగదు రూ.5 లక్షలు కావడంతో బ్యాంకు వారు గుర్తింపు కార్డులు అడిగారు.
దీంతో ఆయన తన కోడలు శ్రీవల్లికి ఫోన్ చేసి బ్యాంకుకు రప్పించాడు. బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఒక పాలథీన్ కవరులో పెట్టుకొని వారు బయటకు వచ్చారు.

సీసీ ఫుటేజీల్లో పరిశీలిస్తున్న పోలీసులు
పెందుర్తికి చెందిన బిల్డర్ సుబ్రహ్మణ్యం గురువారం రెడ్నం గార్డెన్స్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచికి వచ్చారు. చెక్కు నగదు రూ.5 లక్షలు కావడంతో బ్యాంకు వారు గుర్తింపు కార్డులు అడిగారు.

బాధితులు డ్రా చేసుకున్న బ్యాంకు
దీంతో ఆయన తన కోడలు శ్రీవల్లికి ఫోన్ చేసి బ్యాంకుకు రప్పించాడు. బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఒక పాలథీన్ కవరులో పెట్టుకొని వారు బయటకు వచ్చారు.

బాధితులు
వారిద్దరు బ్యాంకు నుండి ఇందిరా నగర్ జంక్షన్కు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం జీవీఎంసీ వైపుకు ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో బైకు పైన ఇద్దరు వ్యక్తులు వెనుకగా వచ్చి ఆయన చేతిలో ఉన్న బ్యాగును లాక్కెళ్లారు.

సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు
దీంతో వారు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకులో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఒకరు లోపలి నుండే ఫాలో అవుతున్నట్లు గుర్తించారు. ఫుటేజ్ ఆధారాలతో దొంగలను పట్టుకునేందుకు బృందాలను పంపించినట్లు టూటౌన్ సీఐ కళ్యాణి తెలిపారు.












Click it and Unblock the Notifications