కష్టపడుతున్న కూతురు, జగన్ అభ్యర్థి కుస్తీ (పిక్చర్స్)

విశాఖ: ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో సమాప్తం కానున్నది. దాదాపు మూడు వారాల నుంచి ప్రచారంతో హోరెత్తిన పట్టణాలు, పల్లెల్లో ఇక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడనున్నది.

సభలు, ఇంటింటా ప్రచారం, రోడ్‌షోలకు మరికొంత సమయానికి బ్రేక్ పడనున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాలి.

ఈ వేళల తరువాత ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో రానున్న 48 గంటలు అభ్యర్థులకు అత్యంత కీలకం. లోపాయికారి ఒప్పందాలు, రాయబేరాలకు తెరతీయనున్నారు. అభ్యర్థులు డబ్బు, మద్యం, వస్తువులు పంపిణీ చేసే అవకాశాలు వుండడంతో అధికారులు నిఘా పెంచారు.

దీపిక

దీపిక

తెలుగుదేశం పార్టీ, బిజెపి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు కూతురు దీపిక, అల్లుడు సునీల్‌లు కంచరపాలెంలో విష్ణు తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు.

విజయమ్మ

విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ప్రచారం నిర్వహించారు.

వెంకయ్య

వెంకయ్య

ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మార్నింగ్ వాక్‌కు వచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థి హరిబాబుతో కలిసి ఆయన వాకర్స్‌ను కలుసుకుని ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు.

వెంకయ్య

వెంకయ్య

ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మార్నింగ్ వాక్‌కు వచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థి హరిబాబుతో కలిసి ఆయన వాకర్స్‌ను కలుసుకుని ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు.

వెంకయ్య

వెంకయ్య

ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మార్నింగ్ వాక్‌కు వచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థి హరిబాబుతో కలిసి ఆయన వాకర్స్‌ను కలుసుకుని ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆటోగ్రాఫ్ ఇస్తూ...

ర్యాలీ

ర్యాలీ

విశాఖపట్నం జిల్లాలోని బర్మా క్యాంప్ క్యాలీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కామన్ ర్యాలీ దృశ్యం. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టిడిపి

టిడిపి

విశాఖలో బిజెపి ఎంపి అభ్యర్థి హరిబాబు, బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, విద్యార్థి నాయకుడు అడారి కిషోర్.. తదితరులు చేతులు కలిపిన దృశ్యం.

యాష్కీ

యాష్కీ

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుడు, నిజామాబాద్ లోకసభ అభ్యర్థి మధుయాష్కీ విశాఖలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

చిరు, మర్రి

చిరు, మర్రి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుడు, సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి, కేంద్ర పర్యాటక సాఖ మంత్రి చిరంజీవిలు విశాఖలో ప్రచారం చేస్తూ...

ఓటు

ఓటు

శాంతియుత విశాఖ కావాలా.. లేక ఇటువంటి విశాఖ కావాలా.. ఆలోచించి ఓటు వేయాలని.. అవగాహనా ఫ్లెక్సీలు విశాఖలో పెద్ద ఎత్తున వెలిశాయి.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ.. భోజన వేళకు చెట్ల కింద కూర్చొని తింటున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, ఇతరులు పాలు పితుకుతూ ఓట్లు అడుగుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+