కోపమొచ్చి రోజా ఔట్, ఎమ్మెల్యేల హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. బాబు ప్రకటన సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్చకు పట్టుబడింది. నిరసన మధ్యనే బాబు ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'విజయవాడ పరిసరాల్లోనే రాజధాని. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాం. పట్టణీకరణ, ప్రాథమిక రంగాల వృద్ధి, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక మిషన్, మౌలిక, సేవా, నైపుణ్య రంగాల విస్తరణ, సామాజిక సాధికారత మా లక్ష్యాలు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పన బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘం చూస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ప్రాధాన్యతనిస్తున్నట్టే.'
జగన్ మాట్లాడుతూ.. 'విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. సామాన్యుడు, నిరుద్యోగి, జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చేవాళ్లు కూడా రాజధానిలో ఉండగలగాలనేది మా అభిమతం. ముఖ్యమంత్రి ప్రకటన ప్రజాస్వామ్యబద్ధం కాదు. విపక్షాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.'

శాసన సభ
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద టీవీ చూస్తూ..

శాసన సభ
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్న సమయంలో మీడియా దృశ్యం.

శాసన సభ
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్న సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల మాటామంతి.

రోజా నిరసన
చర్చకు ముందే ప్రకటన చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చిన దృశ్యం.

రోజా నిరసన
చర్చకు ముందే ప్రకటన చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా నిరసన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం.

శాసన సభ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో టీడీపీ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల ఆనందం.

శాసన సభ
చర్చకు ముందే ప్రకటన చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications