బాబుపై రోజాకు కోపమొచ్చి.. అసెంబ్లీలో ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
అధికార బలంతో గవర్నర్ ప్రసంగాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా శనివారం ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమిలేదని ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెైస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రోజా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో... తోటి సభ్యులతో కలిసి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్ రెడ్డిల దృశ్యం.
వైయస్సార్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రోజా
రైతు రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల పాటు రైతులను అగమ్యగోచర పరిస్థితుల్లోకి నెట్టేశారని రోజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లను పెంచుతామని హామీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం... ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి అందిస్తామని చెబుతోందని విమర్శించారు.
శ్రీకాంత్ రెడ్డి
గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోవడానికి ఏమీ లేదని రోజా, శ్రీకాంత్ రెడ్డి తదితరులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నర్సింహన్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేత జగన్ కూడా పెదవి విరిచారు.