మంగళగిరిలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ !!
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో తండ్రీకొడుకులు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట టాపిక్ గా మారింది.
నార్త్ సబ్డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో బాధిత బాలిక తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో, అక్కడే మాటు వేసిన ముగ్గురు నిందితులు ఆమెను మాయమాటలతో నమ్మించి ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. ఆమెను ఆటోలో తీసుకెళ్లిన నిందితులు బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో పాల్గొన్నవారిలో షేక్ ఖాదర్ బాషా (50) - తాడేపల్లి కేఎల్ రావు కాలనీ, షేక్ సలీమ్ (42) - విజయవాడ ప్రకాష్ నగర్, షేక్ రబ్బానీ (39) ఉన్నారు. అనంతరం సలీమ్ బాలికను లక్ష్మీ నరసింహస్వామి కాలనీ చివరకు తీసుకువెళ్లి మరోసారి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఖాదర్ బాషా, అతని కుమారుడు కమల్ సాహెబ్ (25) బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో తండ్రీకొడుకుల ప్రమేయం ఉండటం తీవ్ర కలకలం రేపింది.
అయితే ఆ తర్వాత షేక్ రబ్బానీ బాలికను ఆటోలో తీసుకువెళుతుండగా.. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఆటోను అడ్డుకుని బాలికను నిందితుల నుంచి విడిపించారు. దీంతో బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. చివరికి బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయం వివరించింది. వెంటనే ఆమె తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు నిందితులపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ఎయిమ్స్కు తరలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా.. అంతకు ముందు నిందితులను స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications