విజయారెడ్డి: ఎంపి కవితతో ముసిముసిగా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరినట్టు దివంగత మాజి మంత్రి పి. జనార్దన్ రెడ్డి కూతురు పి.విజయారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరారు.
బుధవారం ఉదయం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఉన్న తన తండ్రి విగ్రహానికి పూల మాలలు వేసి, అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా టిఆర్ఎస్ భవన్కు బయలుదేరారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన తన తండ్రి పీజేఆర్ తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలను వ్యతిరేకించే వారని విజయారెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర పునఃనిర్మాణంలో కలిసి రావాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపు తనను టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చే విధంగా ప్రేరణ కలిగించిందని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని అన్నివర్గాల ప్రజలు విశ్వవిస్తున్నారన్నారు.
తండ్రి పిజెఆర్కు నివాళులు...
హైదరాబాద్ ప్రజల మనసు దోచుకున్న తన తండ్రి పి. జనార్దన్ రెడ్డి (పిజెఆర్)కి విజయారెడ్డి నివాళులు అర్పించారు.
ర్యాలీగా విజయారెడ్డి
విజయారెడ్డి టిఆర్ఎస్లో చేరుతున్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ వాదులు, పీజేఆర్ అనుచరులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ చేరుకొని ఆమెతో ర్యాలీగా బయలుదేరారు.
ర్యాలీలో విజయారెడ్డి ఇలా..
ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట, జీవీకే వన్, రోడ్నెంబర్ 10, క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా భవన్కు చేరుకున్నారు.
పిజెఆర్ చిత్రపటానికి నివాళులు...
తన తండ్రి పి. జనార్దన్ రెడ్డి చిత్రపటానికి విజయా రెడ్డి నివాళులు అర్పించి, తెరాసలో చేరడానికి సిద్ధమయ్యారు.
విజయా రెడ్డి ర్యాలీ..
విజయారెడ్డి ర్యాలీ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
కవిత, కెకెలతో ఇలా...
తెరాసలో చేరడానికి వచ్చిన విజయారెడ్డి కెకె, మహమూద్ అలీ, కవితల సరసన ఇలా కూర్చుని ఆసక్తిగా వింటూ..
కవితతో విజయా రెడ్డి ఇలా..
విజయా రెడ్డి తెరాస కండువా కప్పుకున్న తర్వాత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో విజయా రెడ్డి ఇలా కనిపించారు.
తెరాసలోకి అహ్వానం..
తనకు అత్యంత సన్నిహితుడైన పిజెఆర్ కూతురు విజయా రెడ్డిని కె. కేశవరావు కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.