Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కళ్యాణకట్ట, లగేజ్ సెంటర్లల్లో ఇకపై..

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 77,803 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,766 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది.

టీటీడీలోని వివిధ విభాగాలపై అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం ఏర్పాటైంది. టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఆయా విభాగాలవారీగా సమీక్ష కొనసాగింది.

Pilgrim Feedback Drives Improvements in Public Transport Annaprasadam and Sanitation at Tirumala

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. పలు ఆదేశాలు ఇచ్చారు. టీటీడీలోని అన్ని విభాగాల్లో ఉన్న స్క్రాప్ ను గుర్తించి 15 రోజుల్లో రిపోర్ట్ అందించాలని సూచించారు. ఆరు నెలలకు ఒకసారి ప్రతి విభాగంలో స్క్రాప్ తొలగింపునకు షెడ్యూల్ రూపొందించాలని అన్నారు. వేలం ద్వారా ఆ స్క్రాప్ ను ఎప్పటికప్పుడు విక్రయించడానికి ర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

అదేవిధంగా టీటీడీలో అమలు చేస్తోన్న ఫీడ్ బ్యాక్ వ్యవస్థ అద్భుత ఫలితాలు ఇస్తోందని, దీనిని ఇదేవిధంగా కొనసాగించాలని వెంకయ్య చౌదరి సూచించారు. భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలతో తిరుమలలో ప్రజా రవాణా, అన్న ప్రసాదం, పారిశుద్ధ్య సేవలు గతంలో కంటే ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్, కళ్యాణకట్ట, లగేజ్ సెంటర్లల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరించడంలో భాగంగా సాంకేతికతను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

భక్తులు విరివిగా టీటీడీకి విరాళాలను అందించడానికి వీలుగా తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రిలో కూడా కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అదనపు ఈఓ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల ఇటువంటి కియోస్కులు అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే. వీటిని అశ్విని ఆసుపత్రిలో కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+