తెలుగు ప్రజలను హత్య చేసినట్లు ఉంది: పితాని వ్యాఖ్య
ఏలూరు: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు ప్రజలను హత్య చేసినట్లే ఉందని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కృష్ణా నదిపై ఇప్పటికే 32 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఉన్నాయని, ప్రస్తుత తీర్పుతో అవన్నీ వృధా అవుతాయని ఆయన అన్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించలేదనే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మాటలో నిజం లేదని ఆయన అన్నారు. నీటి లభ్యతను 65 శాతంగా తీసుకోవడం వల్లనే ఈ విధంగా తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.

బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోతుందని, తీర్పు ప్రజలను అవమాన పరిచే విధంగా ఉందని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ తీర్పుతో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు పథకాలకు భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రెండు ప్రాజెక్లుల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.4,418 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అయినా మిగులు జలాలపై మన వాదనలను వినిపించకపోవడంతో పరిస్థితి తారుమారైందని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications